3, మే 2011, మంగళవారం

ఛందస్సు


ఛందస్సు
పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు.
విషయ సూచిక
          1 తెలుగు ఛందస్సు 2 గురువులు, లఘువులు 3 గురువు, లఘువు, విభజించడము4కొన్నినియమాలు
5 గణాలు 6 రెండక్షరాల గణాలు 7 మూడక్షరాల గణాలు 8 ఉపగణాలు 9 పద్య లక్షణాలు 10 వృత్తాలు
11 జాతులు 12 ఉప జాతులు
తెలుగు ఛందస్సు
తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు.
గురువులు, లఘువులు
ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉన్నది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు మరియు లఘువు. గురువుని U తోటీ, లఘువుని | తోటీ సూచిస్తారు
గురువు, లఘువు, విభజించడము
ఈ గురు లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందు మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలూ ఒక్కొక్కటీ ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులొ మొదటి అక్షరము అ ఒక లిప్త కాలము ఆ తరువాతి మ్మ అక్షరము రెండు లిప్తల కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, , ల లు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అందురు.
కొన్ని నియమాలు
దీర్ఘాలన్నీ గురువులు, ఉదాహరణకు ఆ ఈ ఊ ౠ ఏ ఓ ; కా కీ కూ కౄ కే కో
"ఐ" "ఔ" లు వీటితో  కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔను లో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)
ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడి లో సం గురువు, అంత:పురము లో త: అనునది గురువు )
సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మ లో అ గురువు, భర్త లో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండుపదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)
ఋ అచ్చుతో ఉన్న అక్షరాలూ, వాటి ముందరి అక్షరాలూ (కృ , మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సంధర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమ లో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.
పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు" లో "సెన్" గురువు)
గణాలు
గణాలు అనగా, రెండు లేక అంత కంటే ఎక్కువ అక్షరాల గురు లఘు నిర్ణయాన్ని బట్టి వాటిని ఏదో ఒక (గ్రూపు)విభాగము లో ఉంచుతారు, దీనినే ఏదో ఒక గణము అని అంటారు.
రెండక్షరాల గణాలు
మొత్తము ఉన్నవి రెండు రకాల అక్షరాలు గురువు, లఘువు; రెండక్షరాల గణాలు మొత్తము నాలుగు వస్తాయి (బైనరీ 0, 1 కాంబినేషన్లు తీసుకున్న 00, 01, 10, 11 వచ్చినట్లు) ఆ నాలుగు రెండక్షరాల గణాలు:
లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు (దీనిని లా గణమని కూడా అంటారు)
లగ IU ఉదా: రమా (దీనిని గణము అనికూడా అంటారు)
గల UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ (దీనిని గణమనికూడా అంటారు
గగ UU ఉదా: రంరం, సంతాన్(దీనిని గా గణమనికూడా అంటారు)
మూడక్షరాల గణాలు
ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి
అన్ని గణాలు:


ఆది గురువు  UII  =        గణము
మధ్య గురువు  IUI =       గణము
అంత్య గురువు  IIU =       గణము
సర్వ గురువు  UUU=      గణము
ఆది లఘువు   IUU =      గణము
మధ్య లఘువు  UIU =      గణము
అంత్య లఘువు  UUI =      గణము
సర్వ లఘువులు  III =       గణము
పైన గణాల క్రింద గీతలు గీసానుకదా ,అలా గీత గీసిన వాటిని మాత్రమే చదవండి  భజసమ -యరతన  కనిపించాయా వాటిని అలాగే గుర్తుంచుకోండి .మంత్రంలా జపించండి భజసమ యరతన ;భజసమ యరతన .
భజసమ అంటే భ= ఆది గురువు ,జ =మధ్య గురువు,స =చివరి గురువు ,మ =సర్వ గురువు
యరతన అంటే య = ఆది లఘువు ,ర =మధ్య లఘువు ,త = చివరి లఘువు, న= సర్వ లఘువు

ఇవి మూడక్షరముల గణములు
ఉపగణాలు
ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనం లో ఏర్పడేవి. ఇవి మూడు రకములు
సూర్య గణములు
న = న = III
హ = గల = UI
ఇంద్ర గణములు
నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI

పద్య లక్షణాలు
వృత్తాలు
గణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నటువంటివి వృత్తాలు. ఇందు చాలా రకాలు కలవు.
ఉత్పలమాల
లక్షణములు
 భానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ
 స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్.
 పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20
ప్రతిపాదంలోని గణాలు: భ, , , , , ,
యతి : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము
ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు
క్రింది పాదానికి గణవిభజన చేసి ఉత్పలమాల  లక్షణాలు గుర్తించండి

నా విని సత్యభామ వదనంబున లేనగవంకురింప నే

చంపకమాల
నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్.
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరల సంఖ్య = 21
ప్రతిపాదంలోని గణాలు: న, , , , , ,
యతి : ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము
ప్రాస: పాటించ వలెను


క్రింది పాదానికి గణవిభజన చేసి చంపకమాల లక్షణాలు గుర్తించండి

గరుడుని ఱెక్కలం బొడము గాడ్పులసోఁకునఁదక్కు వేలుపుం

శార్దూల విక్రీడితము
లక్షణములు
సారాచార విశారదాయి నయితిన్ శార్దూల విక్రీడితా
కారంబై మసజమ్ము లిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్.
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19
ప్రతిపాదంలోని గణాలు: మ, , , , , ,
యతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము
ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
క్రింది పాదానికి గణవిభజన చేసి శార్దూల లక్షణాలు గుర్తించండి

మత్తేభ విక్రీడితము
లక్షణములు
నలువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం
పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా.
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య = 20
ప్రతిపాదంలోని గణాలు: స, , , , , ,
యతి : ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము
ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
క్రింది పాదానికి గణవిభజన చేసి మత్తేభ లక్షణాలు గుర్తించండి



జాతులు
జాతులు మాత్రాగణములతో మరియు ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమములు ఉన్నాయి.
కందం
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.
లక్షణములు
కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్
బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్.

పాదాలు: 4
కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, , , , నల ఇవీ ఆ గణాలు
1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు
2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు
2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి
2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి
పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి
యతి
2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి
ప్రాస
ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు
ద్విపద
ద్విపద తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి. పద్యం కంటె ద్విపద సామాన్య ప్రజలకు మరింతగా చేరువవుతుంది. తెలుగు సాహిత్యంలో భారత, భాగవత, రామాయణాలు ద్విపద కావ్యాలుగా రచించబడ్డాయి.
విషయ సూచిక
లక్షణములు
ఇంద్ర గణములు మూఁ డిన గణంబొకటి
చంద్రాస్య ! ద్విపదకుఁ జను చెప్పరేచ
ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి (అందుకే దీనిని ద్విపద అంటారు)
ప్రతిపాదములోనీ మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.
యతి: మూడవ గణం యొక్క మొదటి అక్షరం.
ప్రాస: ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.
ఉప జాతులు
ఆటవెలది
ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు ఆటవెలది.'
పాదాల సంఖ్య = 4
1, 3 పాదాలు మెదటి 3 గణాలు సూర్య గణాలు + తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి ఉంటాయి
2,4 పాదాలు 5 సూర్య గణాలు ఉంటాయి
యతి
ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం యతి
ప్రాసయతి చెల్లును
ప్రాస
ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లును.
తేటగీతి
లక్షణాలు
"సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకరద్వయంబు తేటగీతి"
పాదాలు: 4
ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం + రెండు ఇంద్ర గణాలు + రెండు సూర్యగణాలు ఉంటాయి
యతి
నాల్గవ గణంలో మొదటి అక్షరం యతి
ప్రాసయతి చెల్లును
ప్రాస
ప్రాస నియమం లేదు

సీసము
లక్షణములు
పాదముల సంఖ్య = 4
ప్రతి పాదంలోనూ 6 ఇంద్ర గణాలు, + 2 సూర్య గణాలు కలిపి మొత్తం ఎనిమిది గణాలు ఉంటాయి.
ఈ పద్యాలు పెద్దవి కావడం చేత ప్రతి పాదాన్నీ రెండు భాగాలుగా చూపుతారు.
ఈ నాలుగు పాదాలకూ చివర ఆటవెలది కానీ, తేటగీతి గానీ ఉండవలెను, ఇది తప్పనిసరి.
[మార్చు]యతి
యతి
1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోనూ,
5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోనూ మైత్రి కుదరాలి.
ఉదా: లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక
ప్రాసయతి ఉండ వచ్చు.
అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో అక్షరాలు ప్రాస నియమం పాటిస్తే చాలు - అంటే ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే).
ఉదా: లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక
ప్రాస
ప్రాస నియమం లేదు.

19 కామెంట్‌లు:

  1. ఛందోబద్ధ విధానాలను వివిధ పద్య నిర్మాణ రీతులను తెలుగు యువతరానికి ఔత్సాహికులకు అతి సరళ రీతిన అందించిన మిమ్ములను అభినందిస్తున్నాను.
    నాకు అనుమతినిస్తే ఈ ప్రచురణను నేను నా ఎఫ్బి పుట ద్వారా ఔత్సాహిక యువతకు అందిద్దామని యుచనతో కాపీ చేసుకోవడానికి అనుమతి కోరుతున్నాను....శ్రేయోభిలాషి ..Nutakki Raghavendra Rao
    www.nutakki.wordpress.com (కనకాంబరం)

    రిప్లయితొలగించండి
  2. ఉప గణాలు "మూడు" అన్నారు.. కానీ రెండే చెప్పారు "సూర్య" , "ఇంద్ర" గణాలు... మూడవది?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్ర గణములు
      భల = UIII
      భగరు = UIIU
      తల = UUII
      తగ = UUIU
      మలఘ = UUUI
      నలల = IIIII
      నగగ = IIIUU
      నవ = IIIIU
      సహ = IIUUI
      సవ = IIUIU
      సగగ = IIUUU
      నహ = IIIUI
      రగురు = UIUU
      నల = IIII

      తొలగించండి
    2. నల అనునది ఇంద్ర మరియు చంద్ర గణాల్లో ఉంది . రెంటిలో ఉంటుందా

      తొలగించండి
  3. ఎన్నో రోజుల నుండి ఎదురు చూచిన నాకు, మీ లాంటి వారి సౌజన్యంతో వెలిసిన ఈ Web site ఉపయోగపడగలదని భావిస్తాను. నేను యతిప్రాసయుక్త ఛందోబద్ధపద్యాలు స్వీయ అభిరుచి మేరకు వ్రాస్తున్నాను. చిన్న చిన్న వ్యాకరణ ద్షోషాలు సరి చేసికోవాలని ఉంది మీరు అనుమతిస్తే..🙏

    రిప్లయితొలగించండి
  4. ఎన్నో రోజుల నుండి ఎదురు చూచిన నాకు, మీ లాంటి వారి సౌజన్యంతో వెలిసిన ఈ Web site ఉపయోగపడగలదని భావిస్తాను. నేను యతిప్రాసయుక్త ఛందోబద్ధపద్యాలు స్వీయ అభిరుచి మేరకు వ్రాస్తున్నాను. చిన్న చిన్న వ్యాకరణ ద్షోషాలు సరి చేసికోవాలని ఉంది మీరు అనుమతిస్తే..🙏

    రిప్లయితొలగించండి
  5. ఎన్నో రోజుల నుండి ఎదురు చూచిన నాకు, మీ లాంటి వారి సౌజన్యంతో వెలిసిన ఈ Web site ఉపయోగపడగలదని భావిస్తాను. నేను యతిప్రాసయుక్త ఛందోబద్ధపద్యాలు స్వీయ అభిరుచి మేరకు వ్రాస్తున్నాను. చిన్న చిన్న వ్యాకరణ ద్షోషాలు సరి చేసికోవాలని ఉంది మీరు అనుమతిస్తే..🙏

    రిప్లయితొలగించండి
  6. అయ్యా
    కంద పద్యం పాదం లో చివరి లఘువు
    తరువాత పాదంలో మొదట ద్విత్వాక్షరమ్
    ఉంటే గురువు అవుతుందా

    రిప్లయితొలగించండి
  7. కుక్క బౌ బౌ అని అరుస్తుంది అలంకారం

    రిప్లయితొలగించండి
  8. నమస్తే!సార్
    ప్రాస అనునది ఏయే అక్షరముల కు ఉంటుందో
    తెలుపగలరని ప్రార్ధిస్తున్నాను

    రిప్లయితొలగించండి